బోఫోర్సు పేరుతో బీజేపీ కుట్ర | BJP conspiracy with Bofors | Sakshi
Sakshi News home page

బోఫోర్సు పేరుతో బీజేపీ కుట్ర

Jul 26 2017 1:31 AM | Updated on May 25 2018 2:11 PM

దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీపై బోఫోర్సు పేరుతో బురద జల్ల డం ద్వారా బీజేపీ రాజకీయ కుట్రకు తెరలేపిందని శాసన మండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమ ర్శించారు.

పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీపై బోఫోర్సు పేరుతో బురద జల్ల డం ద్వారా బీజేపీ రాజకీయ కుట్రకు తెరలేపిందని శాసన మండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమ ర్శించారు.

మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లా డుతూ హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకునే కుట్రలో భాగమే బోఫోర్సు ప్రస్తావన అని అన్నారు.   కుట్రపూరిత, సంకుచిత రాజ కీయాలకు నిరసనగా ఆగస్టు 9న రాజీవ్‌ స్మృతివ నమైన శ్రీపెరంబుదూరు వద్ద మౌనదీక్ష చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్‌ మాఫియాను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement