హయత్నగర్ పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్లో బ్రిల్లియంట్ కాలేజీ ఆర్చ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ముందు వెళ్తోన్న గుర్తుతెలియని వాహనాన్ని ఆటో ఢీకొట్టింది.
హయత్నగర్ పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్లో బ్రిల్లియంట్ కాలేజీ ఆర్చ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ముందు వెళ్తోన్న గుర్తుతెలియని వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో బోల్తాపడి నల్గొండ జిల్లా చిట్యాల మండలం సుంకన్పల్లి గ్రామానికి చెందిన రవీందర్(25) అనే డ్రైవర్ మృతిచెందాడు. నిమ్మకాయల లోడుతో చిట్యాల నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.