ఎన్ఐఏ కస్టడీకి ఐసిస్ సానుభూతిపరులు | 5 ISIS sympathisers sent to 12 Days NIA custody | Sakshi
Sakshi News home page

ఎన్ఐఏ కస్టడీకి ఐసిస్ సానుభూతిపరులు

Jul 1 2016 4:39 PM | Updated on Oct 19 2018 7:52 PM

హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన అయిదుగురు ఐసిస్ సానుభూతిపరులను నాంపల్లి కోర్టు 12రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్ :  హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన అయిదుగురు ఐసిస్ సానుభూతిపరులను తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏ అధికారుల కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రెండురోజుల క్రితం అరెస్ట్ చేసిన మహ్మద్ ఇబ్రహీం అలియాస్ ఇబ్బు, హబీబ్ మహ్మద్ అలియాస్ సిర్, మహ్మద్ ఇలియాస్, అబ్దుల్ బిన్ అహ్మద్ అమౌదీ అలియాస్ ఫహద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్లను ఎన్‌ఐఏ అధికారులు ఈ నెల 12వ తేదీ వరకు విచారించనున్నారు. కాగా 30 రోజుల పాటు కస్టడీకి అనుమతి కోరుతూ ఎన్ఐఏ అధికారులు నిన్న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కేవలం పన్నెండు రోజులపాటు అనుమతిచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement