-
ఐఎస్ ఉగ్రవాది అరెస్ట్
సాక్షి, ముంబై : ఉత్తర్ ప్రదేశ్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో అనుమానిత ఐఎస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. దుబాయ్నుంచి భారత్ వచ్చిన అబు జియాద్ అనేవ్యక్తిని ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నడన్న అనుమానంతో అరెస్ట్ చేసినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచే ఐఎస్ నెట్వర్క్ను అబు నిర్వహిస్తున్నాడని.. పశ్చిమ ఉత్తర ప్రదేశ్లోని ముస్లిం యువతను రిక్రూట్ చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాడని పోలీసులు పేర్కొన్నారు. బిజునూర్లోని ఐఎస్ సానుభూతిపరుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో అబు జియాద్ గురించి తెలిసిందని అధికారులు తెలిపారు. -
ఐసిస్ హిట్లిస్టులో జడ్జీలు, ఆర్ఎస్ఎస్ నాయకులు
ఫ్రాన్స్లోని నైస్ నగరంలో జరిగిన భారీ ఉగ్రదాడి మాదిరిగా భారత్లోనూ అటాక్కు ప్లాన్ చేస్తున్న ఓ ఆరుగురు ఐఎస్ఐఎస్ అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో మతనాయకులందరూ సమావేశమైనప్పుడు వాహనాన్ని పేల్చి దాడి చేసేందుకు వారు పన్నాగం పన్నినట్టు తెలుస్తోంది. కాగ గతవారమే ఐఎస్ఐఎస్తో సంబంధాలున్న కేరళ తిరునల్వేలిలో ఓ న్యాయవిద్యార్థిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అతన్ని అదుపులోకి తీసుకున్న కొన్ని రోజుల్లోనే మరో ఆరుగురిని కేరళ పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఏడుగురు కలిసి కేరళలో దాడికి ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడైంది. నైస్ తరహాలో దాడి మాత్రమే కాక వారి హిట్ లిస్టులో ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ప్రముఖ హేతువాది, ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నట్టు తెలిసింది. విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయని, వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కేరళ పోలీసు డైరెక్టర్ జనరల్ లోక్నాథ్ బెహెరా తెలిపారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ భావజాలానికి ఆకర్షితులైన వీరు, ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుపుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఏడుగురు వయసు 24 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటుందని చెప్పారు. కేరళ నుంచి 21 మంది కనపడకుండా పోయిన కేసును విచారిస్తున్న సమయంలో దర్యాప్తు సంస్థకు వీరు పట్టుబడ్డారు. మొదట ఓ న్యాయ స్టూడెంట్, అనంతరం ఈ ఆరుగురు వ్యక్తులు కన్నూర్ జిల్లా, కోళికోడ్ ప్రాంతాలల్లో పోలీసులకు చిక్కారు. వీరిని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్గానిస్తాన్,అనంతరం సిరియా ఇతర దేశాలకు ఐఎస్ఐఎస్ సరఫరా చేస్తున్నట్టు వెల్లడవుతోంది. ఎన్ఐఏ టీమ్స్తో పాటు కేరళ పోలీసులు, ఢిల్లీ పోలీసులు, తెలంగాణ పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రదాడి ప్లాన్ బయటికి వెల్లడికావడంతో కేరళ గవర్నమెంట్ను, ఆ ఇద్దరు హైకోర్టు జడ్జిలను, కొంతమంది రాజకీయ నాయకులను ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు అలర్ట్ చేశాయి. -
ఎన్ఐఏ కస్టడీకి ఐసిస్ సానుభూతిపరులు
హైదరాబాద్ : హైదరాబాద్లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన అయిదుగురు ఐసిస్ సానుభూతిపరులను తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏ అధికారుల కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండురోజుల క్రితం అరెస్ట్ చేసిన మహ్మద్ ఇబ్రహీం అలియాస్ ఇబ్బు, హబీబ్ మహ్మద్ అలియాస్ సిర్, మహ్మద్ ఇలియాస్, అబ్దుల్ బిన్ అహ్మద్ అమౌదీ అలియాస్ ఫహద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్లను ఎన్ఐఏ అధికారులు ఈ నెల 12వ తేదీ వరకు విచారించనున్నారు. కాగా 30 రోజుల పాటు కస్టడీకి అనుమతి కోరుతూ ఎన్ఐఏ అధికారులు నిన్న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కేవలం పన్నెండు రోజులపాటు అనుమతిచ్చింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)
బీఆర్ఎస్కు ఎదురు దెబ్బ : కాంగ్రెస్లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement