రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి | 23 years old student dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

Mar 5 2017 10:33 AM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

అతివేగం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది.

హైదరాబాద్‌ :
రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌సై ప్రేమ్‌ కథనం ప్రకారం.. నిజామాబాద్‌ కింగ్స్‌ క్లబ్‌ సమీపంలోని మారుతీనగర్‌లో నివాసముండే ఎం.నరేంద్ర ప్రసాద్‌ కుత్బుల్లాపూర్‌ సుచిత్రలోని స్ప్రింగ్‌ఫీల్డ్‌లో నివాసముంటున్నాడు. ఇతని కుమారుడు మార రక్షిత్‌రెడ్డి(23) ఇటీవలే మైసమ్మగూడ ఎంఆర్‌ఐటి కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాడు.

పైచదువులకు అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి కొంపల్లి నుంచి సుచిత్ర వైపు కారులో వస్తుండగా జీడిమెట్ల గ్రామ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న రష్‌ ఆస్పత్రి తరలించారు. పరిస్థితి విషమం కావడంతో సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని
పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement