ఆర్టీసీ బస్సు- లారీ ఢీ: ప్రయాణికుడి మృతి | lorry coiled with rtc bus in guntur district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు- లారీ ఢీ: ప్రయాణికుడి మృతి

Nov 3 2015 8:02 AM | Updated on Apr 7 2019 3:23 PM

వేగంగా వెళ్తున్న బస్సును పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

దాచేపల్లి: వేగంగా వెళ్తున్న బస్సును పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు జిల్లా దాచెపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సును పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వేపూరి కొండయ్య(35) అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement