గుంటూరు జిల్లా ఎడ్లపాడులోని సీఆర్ కోల్డ్ స్టోరేజ్లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా ఎడ్లపాడులోని సీఆర్ కోల్డ్ స్టోరేజ్లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పై భాగంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శీతల గోదాములో కోట్ల రూపాయల విలువైన మిర్చి నిల్వ ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని రైతులు భావిస్తున్నారు.