గ్లకోమాపై అవగాహన ర్యాలీ | Sakshi
Sakshi News home page

గ్లకోమాపై అవగాహన ర్యాలీ

Published Sun, Mar 6 2016 5:50 PM

Glaucoma awareness rally in Hyderabad

బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు గ్లకోమా అవగాహన కోసం నడక కార్యక్రమం నిర్వహించారు. ఈ వాక్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

హైదరాబాద్ రాయల్స్ టీమ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి. చంద్రశేఖర్, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి గ్లకోమా సెంటర్ హెడ్ డాక్టర్ శిరీష సెంథిల్, వైద్యులు, రోగులు, ప్రజలు ఈ వాక్‌లో పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు గ్లకోమా అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా ఈ వాక్ నిర్వహించడం జరిగిందని డాక్టర్ శిరీషా సెంథిల్ తెలిపారు. ఈవ్యాధిపై మరింత అవగాహన పెంచేందుకు ఈ నెల 12న గ్లకోమా ఎడ్యుకేషన్ ఫోరం నిర్వహిస్తున్నామన్నారు.

 

Advertisement
Advertisement