పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.
ఆర్టీసీ బస్టాండ్లో అగ్నిప్రమాదం
Jan 20 2017 8:23 AM | Updated on Sep 5 2018 9:47 PM
వైఎస్సార్ కడప: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బస్టాండ్లోని ట్రాఫిక్ విభాగంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడటంతో ముఖ్యమైన దస్త్రాలు, బస్పాస్లు, సర్వీస్ రిజిస్టర్లు కాలి బూడిదయ్యాయి. స్థానికులు సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Advertisement
Advertisement