-
ఆర్టీసీ బస్టాండ్లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కుటుంబసభ్యులతో కలసి ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్న నవ వధువు కనిపించకుండా పోయింది. అనంతపురం మూడో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు.. ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన మాదేశ్వరికి రామగిరికి చెందిన ఓ యువకుడితో మూడు నెలల క్రితం వివాహమైంది. ఆదివారం ఉదయం తల్లిదండ్రులతో కలసి అనంతపురం బస్టాండుకు మాదేశ్వరి చేరుకుంది. ఆ సమయంలో తాను అత్తింటికి వెళ్లనంటూ మాదేశ్వరి తెలపడంతో తల్లిదండ్రులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత బాత్రూంకు వెళుతున్నట్లు చెప్పిన మాదేశ్వరి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. తల్లిదండ్రులు బస్టాండు, ఆ పరిసర ప్రాంతాలు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: విశాఖలో దారుణం.. మహిళను ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి -
తిరుపతిలో మోడల్ బస్టాండ్
రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకణలో భాగంగా అన్ని ప్రాంతాలకుఅవకాశాలు కల్పించేందుకు చర్యలుతీసు కుంటోంది. ఈ క్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికిఓ సువర్ణ అవకాశం దక్కనుంది.అత్యాధునిక వసతులతో కూడిన మోడల్ బస్టాండ్ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగించే ప్రయాణ ప్రాంగణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలనుకల్పించేందుకు 13 అధునాతన భవనాలను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తిరుపతి అర్బన్: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటుంది. 1972లో తిరుపతి బస్టాండ్ కోసం అప్పటి ప్రభుత్వం సుమారు 13 ఎకరాలను కేటాయించింది. అందులో చిన్నపాటి బస్టాండ్ను నిర్మించారు. తర్వాత కాలంలో ప్రయాణికల రద్దీ పెరగడంతో శ్రీహరి బస్టాండ్, శ్రీనివాస బస్టాండ్, ఏడుకొండల బస్టాండ్, పల్లెవెలుగు బస్టాండ్లుగా విస్తరించారు. వీటిలో 10 భవనాలు, సుమారు 200పైగా దుకాణాలను నిర్మించారు. అయినా ప్రయాణికుల తాకిడి పెరిగిన సమయాల్లో వసతుల కల్పనకు ఇక్కట్లు తప్పడంలేదు. రూ.400కోట్లతో 13 అధునాతన భవనాలు విజయవాడ పురవాస్తుశాఖ అధికారుల బృందం తిరుపతిలో మోడల్ బస్టాండ్ నిర్మాణం కోసం రెండు రోజుల కసరత్తు తర్వాత నివేదిక తయారుచేసింది. సుమారు రూ.400కోట్లతో 13 అధునాతన భవంతులను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రయాణికులకు అవసరమైన వసతులు, అంచనావ్యయం పొందుపరిచిన రిపోర్టును రేపోమాపో ప్రభుత్వానికి అందించనుంది. పరిపాలనా అనుమతులు రాగానే జూన్ నుంచే నిర్మాణ పనులను మొదలు పెట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 13 అంతస్తులను నిర్మించేందుకు సుమారు 3 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా తిరుపతి నగరానికి నాలుగు వైపులా తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రేణిగుంట మార్గం, అలిపిరి, మంగళం, తిరుచానూరును ఎంపిక చేశారు. ప్రస్తుతం తిరుపతిలోని అన్ని బస్టాండ్ల నుంచి నిత్యం సుమారు 1000 బస్సుల్లో 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. జిల్లా మొత్తంమీద ఆర్టీసీకి రూ.2 కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో దాదాపు 40 శాతం తిరుపతి నుంచే సమకూరుతోంది. ప్రస్తుత బస్టాండ్లో ప్రయాణికులకు పూర్తిస్థాయిలో వసతులు లేవు. తిరుపతి బస్టాండ్ను మోడల్గా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి మహర్దశ పడుతుందని పలువురు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీ వద్దకే ఆర్టీసీ బస్సు.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణాలు, పల్లెలకే కాకుండా బస్సులను అన్ని ప్రాంతాలకు నడపాలని భావిస్తున్నారు. ‘మీ వద్దకే.. ఆర్టీసీ బస్సు’ కార్యక్రమానికి రాష్టంలో తొలిసారిగా తిరుపతి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలకు బస్సు సర్వీసులను అందించనున్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కూడా బస్సులు నడవనున్నాయి. తీర్థయాత్రల కోసం ఎవరైనా సంప్రదిస్తే రాయితీ చార్జీలతో బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. సూచనప్రాయంగా ఆదేశాలందాయి రాష్ట్రంలో తొలి మోడల్ బస్టాండ్ను తిరుపతిలో నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ మేరకు సూచనప్రాయంగా ఆదేశాలందాయి. రూ.400కోట్లతో 13 అంతస్తుల భవనాలను నిర్మించనున్నారు. అందులో ప్రయాణికులకు అత్యాధునిక వసతులు ఉంటాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని అన్ని కర్మాగారాలకు బస్సు సర్వీసులను నడపనున్నాం. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు కూడా బస్సులు వెళతాయి. వ్యక్తిగత కార్య క్రమాలకు కూడా రాయితీ చార్జీతో బస్సు సేవలను అందిస్తాం. ఆర్టీసీ బస్సు వెళ్లని ప్రాంతం ఇక ఉండదు. చివరకు గ్రామీణప్రాంతాల్లోని చిన్నచిన్న ఆలయాలకు కూడా బస్సులను నడుపుతాం. – తిమ్మాడి చెంగల్రెడ్డి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, తిరుపతి -
మాటలతో ఏమార్చి.. నగలతో ఉడాయించారు
రాయచోటిటౌన్: అమ్మా ఇదిగో ఈ చిల్లర నీదేనా అంటూ ఓ మహిళను మాటల్లో పెట్టి ఆమె బ్యాగులోని బంగారు ఆభరణాలున్న పర్సును దోచుకెళ్లిన సంఘటన రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో చోటు చేసుకొంది. బాధితురాలు కొండూరు ఆషాబీ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి మాసాపేటకు చెందిన ఆషాబీ కడపలో తన కుమార్తెకు వివాహం చేసింది. ఆమెకు సంబంధించిన 25 తులాల బంగారు ఆభరణాలు మొత్తం తన వద్దనే ఉండేవి. త్వరలో తన కుమార్తె ఇంటిలో శుభకార్యం జరగనుండటంతో వాటిని కుమార్తెకు ఇచ్చేందుకు మంగళవారం రాయచోటి ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లి బస్సు ఎక్కింది. బస్సులో బాగా రద్దీగా ఉండటంతో ఒక వ్యక్తి తన సీట్లో పక్కకు జరిగి కూర్చునేందుకు స్థలమిచ్చాడు. తాన టీచర్నని చెప్పి నమ్మించాడు. ఇంతలో మరో మహిళ అక్కడికి వచ్చి నిల్చుంది. కండక్టర్ వచ్చి టిక్కెట్లు తీసుకొనే క్రమంలో ఆషాబీ కాళ్ల కింద చిల్లర పడేసి అమ్మా ఈ చిల్లర డబ్బులు నీవేనా.. అంటూ చెప్పాడు. ఆమె కిందకు వంగి చిల్లర ఏరుకొనే క్రమంలో ఆమె బ్యాగ్లోని పర్సు దొంగిలించాడు. బస్సు సాయి థియేటర్ వద్దకు వెళ్లగానే ఈ బస్సు గాలివీడుకు వెళుతుందా అని వారు కండక్టర్ను అడిగారు. వెళ్లదని కండక్టర్ చెప్పడంతో వారు ఇద్దరు అక్కడే బస్సు దిగేశారు. బస్సు రింగ్ రోడ్డు వద్దకు వెళ్లిన తర్వాత ఆషాబీ తన బ్యాగ్ను పరిశీలించి చూసుకోగా అందులో బంగారు ఆభరణాలు లేకపోవడంతో లబోదిబో మంటూ ఏడుస్తూ బస్సు దిగి ఇంటికెళ్లింది. బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బస్టాండ్లో ప్రయాణికుడి మృతి
హన్మకొండ చౌరస్తా: తన కొడుక్కి జబ్బు తగ్గాలని ఆస్పత్రిలో చికిత్స అందించిన తల్లి.. తన కొడుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన హృదయ విదారక సంఘటన శుక్రవారం హన్మకొండ కొత్త బస్టాండ్లో చోటు చేసుకుంది. మృతుడి తల్లి అనసూర్య తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు వెంకటాపూర్ మండలంలోని రంగరాజుపల్లి కాలనీకి చెందిన గుండ్ల జయరాజ్(30) పెయింటింగ్ కార్మికుడు. కొద్దికాలంగా కేన్సర్తో భాదపడుతున్నాడు. జయరాజ్ను వైద్యుల సూచనల మేరకు రెండు నెలలుగా హైదబాద్లోని ఎంఎన్జే కేన్సర్ ఇనిస్టిట్యూట్లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స ముగియడంతో ఇంటికి తీసుకెళ్లవచ్చన్న వైద్య నిపుణుల సూచనల మేరకు జయరాజ్ను తల్లి అనసూర్య హైదరాబాద్ నుంచి సొంతూరుకు తీసుకెళ్తోంది. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హన్మకొండ బస్టాండ్కు వారు చేరుకున్నారు. అయితే వారు బస్ కోసం ఎదురు చూస్తుండగా మృతుడు జయరాజ్ కాసేపు ఎండలో ఉంటానని తల్లి అనసూర్యకు చెప్పి బస్టాండ్ ఆవరణలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద వెళ్లి కూర్చున్నాడు. అక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో గమనించిన తల్లి కేకలు వేస్తూ రోదిస్తుండంతో సాటి ప్రయాణికులు 108కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్, సిబ్బంది జయరాజ్ను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ ఎస్సై ప్రవీణ్కమార్ మృతుడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాతల సాయంతో ఇంటికి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు సైతం డబ్బులు లేకపోవడంతో ఎస్సై ప్రవీణ్కుమార్, సాటి ప్రయాణికులు కొంత మొత్తాన్ని సేకరించి రూ.8 వేలను జయరాజ్ తల్లికి అందించారు. అంతేకాకుండా అంబులెన్స్ను మాట్లాడి జయరాజ్ మృతదేహాన్ని సొంతూరికి తరలించారు. -
అనాథలుగా అనంతలోకాలకు..
వేర్వేరు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు మృతి కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక రామయ్య ఐఐటీ కాలేజీ సమీపంలో సుమారు 35 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. సుమారు 5.5 అడుగుల ఎత్తు, నలుపు రంగు ఉంటాడు. బ్లాక్ ప్యాంటు ధరించాడు. ఆర్టీసీ బస్టాండ్ ఔట్వే దగ్గర వ్యాపార దుకాణం ముందు సుమారు 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతిచెందాడు. నలుపు, బ్లూ రంగులు గల షర్టు, బ్లూ డ్రాయర్ ధరించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నాల్గవ పట్టణ పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో వడదెబ్బతో మృతిచెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు 94406 27736, 08518–259462కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ నాగరాజరావు కోరారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
Advertisement