సహజమైన సౌందర్యం | Funday beauty tips 21-04-2019 | Sakshi
Sakshi News home page

సహజమైన సౌందర్యం

Apr 21 2019 12:34 AM | Updated on Apr 21 2019 12:34 AM

Funday beauty tips 21-04-2019 - Sakshi

ఓ పక్క కాలుష్యంతో, మరోపక్క ఉక్కబోతలతో ముఖం రోజురోజుకీ కాంతిహీనంగా మారిపోతుందా? జిడ్డు, మచ్చలు, మొటిమలతో అందహీనంగా తయారవుతుందా? అయితే కాస్త తీరక చేసుకుని క్లీనప్, స్క్రబ్‌ వంటివి ప్రయత్నించండి. ఆవిరి పట్టించుకుని, ఇరవై నిమిషాల పాటు సహజసిద్ధమైన మాస్క్‌ వేసుకోండి. ఇక రిజల్ట్‌ మీకే తెలుస్తోంది.


కావల్సినవి: క్లీనప్‌ : చిక్కటి పాలు – 2 టీ స్పూన్లు(కాచనివి), తేనె – అర టీ స్పూన్‌
స్క్రబ్‌ : ఓట్స్‌ – అర టేబుల్‌ స్పూన్, టమాటా గుజ్జు – అర టేబుల్‌ స్పూన్‌
మాస్క్‌:  కమలాపండు గుజ్జు – 2 టీ స్పూన్లు, మంచి గంధం – అర టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు, గడ్డ పెరుగు – పావు టీ స్పూన్‌
తయారీ: ముందుగా చిక్కటి పాలు, తేనె ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, టమాటా గుజ్జు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కమలాపండు గుజ్జు, మంచి గంధం, శనగపిండి, గడ్డపెరుగు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement