చుట్టూ భవనాలు.. వీటి మధ్యకు కాడెడ్లు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారా..! ఈ వ్యవసాయ క్షేత్రం హైటెక్సిటీకి కూతవేటు దూరంలో ఉంది. ఓ పదేళ్లు ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే ఇక్కడన్నీ వ్యవసాయ భూములే. అభివృద్ధి పథంలో ముందుగా ఇక్కడికి హైటెక్ సిటీ వచ్చింది.. దాని వెంట దేశవిదేశాలకు చెందిన ఎన్నో ఐటీ కంపెనీలు బారులు తీరాయి.. అంతే.. అక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటాయి. రియల్ బూమ్ రెక్కలు తొడిగి.. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. వాలిపోయింది. కాసుల గలగల ముందు ధాన్యరాసుల కళ చిన్నబోయింది. వందలాది ఎకరాల వ్యవసాయ భూమి రియల్ సెక్టర్గా మారిపోయింది. ఇదే జోరులో ఎందరో కట్టల గుట్టలు ఆఫర్ చేసినా.. ఓ పెద్దాయన మాత్రం తన భూమిని అమ్మేదిలేదని భీష్మించుకున్నాడు. చుట్టూ ఐటీ ప్రపంచం సోకులు పోతున్నా.. నేటికీ పల్లెటూరి మోతుబరిలా దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నాడు.
ఓ వైపు తళతళ మెరిసే రోడ్లు.. మరోవైపు ఆకాశాన్నంటే ఐటీ భవనాలు.. వీటి మధ్యే ఉంది సయ్యద్ జాఫర్ ఐదెకరాల వ్యవసాయ భూమి. ఆయన పొలానికి అటుఇటుగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలన్నీ కోట్లకు అమ్ముడుపోయాయి. అయినా జాఫర్ బాయ్.. ‘భూమిని నమ్ముకుంటాను కానీ అమ్ముకోనని’ డిసైడ్ అయ్యాడు. ఆయన మనసెరిగిన కొడుకు సయ్యద్ గౌస్ కూడా తండ్రి బాటలోనే సాగుతున్నాడు.
తృణప్రాయంగా..
నాలుగు తరాలుగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తోంది ఈ కుటుంబం. తాతలనాడు అరక పట్టి.. మెరక దున్నారంటే ఓకే..! తమ పొలానికి ఎన్ని ఆఫర్లు వచ్చినా తోసిపుచ్చి.. నేటికీ సయ్యద్ కుటుంబం పొలం పనులతోనే జీవనం సాగిస్తోంది. ఇప్పటికీ కాడెడ్లతోనే పొలాన్ని దున్నుతున్నారు. సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తున్నారు. తిండిగింజలు కరువైన నాడు ఎన్ని డబ్బులు ఉన్నా ఏం లాభం అంటాడు జాఫర్ ఉరఫ్ ఫకీర్సాబ్. రైతులు ఉన్నప్పుడే.. జనజీవనం సాగుతుందని చెబుతాడు. ఈ పొలంలో వరితోపాటు టమాటాలు, వంకాయలు, సొరకాయలు వంటి కూరగాయలతో పాటు, ఆకుకూరలూ పండిస్తున్నారు. ‘ఎనిమిదేళ్ల నుంచి ఈ పొలంలో పనిచేస్తున్నా. మాదాపూర్లో పొలం పనులకు వెళ్తున్నా అంటే హైటెక్సిటీలో పొలమేందని మా వాళ్లు ఆశ్చర్యపోతుంటరు’ అని చెబుతుంది రైతు కూలి శాంతమ్మ.
మా ఇంటి పంటే తింటాం..
‘నాకిప్పుడు 80 ఏళ్లు. నా కొడుకులు, మనవళ్లతో సమానంగా నడుస్తా. మా పొలంలో పండిన కూరగాయలే తింటం. మా ఇంటి నుంచి పొలానికి కిలోమీటర్ ఉంటది. రోజూ రెండు మూడు సార్లు పొలానికి నడుచుకుంటనే పోయొస్తుంట. ఈ తరం వారికి వ్యవసాయం భారంగా తోస్తోంది. గిట్టుబాటుకాకా.. పల్లెల్లో కూడా చాలామంది రైతులు వ్యవసాయానికి దూరమైతున్నరు’ అని అంటారు సయ్యద్ జాఫర్.
నాన్న కోరిక.. నా ఇష్టం..
‘చిన్నప్పటి నుంచే మా నాన్న వ్యవసాయంపై నాకు ఆసక్తి కలిగించారు. మా నాన్న కోరిక మేరకు వ్యవసాయం చేస్తున్నా. మా తమ్ముడు హోటల్ నడిపిస్తున్నాడు. బాగానే లాభాలు వస్తున్నాయి. అయినా పొలంబాట వీడేది లేదు. మా పిల్లలు ‘వ్యవసాయం ఎందుకు నాన్నా’ అని అంటుంటారు. ఈ దారిలో వెళ్తూ చాలామంది మా పొలం దగ్గర ఆగి చూస్తుంటారు. ‘ఇక్కడ వ్యవసాయమా.. మంచి పని చేస్తున్నావ్..!’ అని మెచ్చుకుంటారు కూడా’ అంటూ సంతోషంగా చెబుతారు సయ్యద్ గౌస్ .
.:: తన్నీరు సింహాద్రి, మాదాపూర్
జీవితమే సపొలం
Published Sun, Apr 5 2015 10:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం
ఆర్య కథ వినగానే ఇది నా ఇడియట్ అనిపించింది: అల్లు అర్జున్
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
సీఎం జగన్ వెంటే ఉంటాం ●
నగేష్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
గుత్తి కోటను సందర్శించిన ఎన్నికల పరిశీలకుడు
నయ వంచకుడు చంద్రబాబు
No Headline
జేసీకి భంగపాటు తప్పదు
పల్లె పిలిచింది
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement