ఒక సందర్భంలో ముహమ్మద్ ప్రవక్త మహనీయులు ఇలా అన్నారు. ‘ఎవర్ని గురించీ చెడుగా మాట్లాడకండి. ఏ చిన్న సత్కార్యాన్నీ అల్పమైనదిగా భావించకండి. మంచి పని ఎంత స్వల్పమైనదైనా దాన్ని చేస్తూనే ఉండండి. తోటివారిని చిరునవ్వుతో పలకరించడం కూడా గొప్ప సత్కార్యమేనని గుర్తుంచుకోండి.
దైవప్రవక్త ముహమ్మద్ (స) అనుక్షణం మానవాళి సంక్షేమం కోసం, వారి ఇహ, పర సాఫల్యం కోసం తపించారు. శత్రువును సైతం ప్రేమతో గుండెలకు హత్తుకోగలిగిన దయామయుడాయన. తనను చంపెయ్యాలని పగబట్టి వెంటాడిన అగర్భ శత్రువులను సైతం ఆయన క్షమించారు. తన బాబాయిని చంపి, కిరాతకంగా, ఆయన కాలేయాన్ని నమిలిన హంతకురాల్ని ఆయన మన్నించారు. మంచిని బోధించినందుకు రక్తసిక్తమయ్యేలా కొట్టిన ‘తాయిఫ్’ ప్రజలను క్షమించమని, వారికి సన్మార్గం చూపమని విశ్వప్రభువును ప్రార్థించారు.
శత్రువును శపించమని స్నేహితులు కోరినప్పుడు, ‘నేను ప్రపంచానికి కారుణ్యంగా వచ్చాను. శాపంగా రాలేదు’ అని బదులిచ్చారు. ‘మీరు, మీ చెడు కోరేవారి శ్రేయాన్ని కాంక్షించండి. మిమ్మల్ని శపించే వారికోసం మీరు ప్రార్థించండి. మీకు కష్టనష్టాలు కలిగించేవారికి మీరు న్యాయం చెయ్యండి’ అని ఆ దయాగుణ సంపన్నుడు ఉపదేశించారు. దైవప్రవక్త( స) ప్రవచనాలకు దర్పణం పట్టే దివ్యవాక్యాలు దైవగ్రంథంలో ఇలా ఉన్నాయి:
‘విశ్వసించిన ప్రజ లారా! అల్లాహ్ కోసం, నీతి నిజాయితీలకు కట్టుబడి ఉంటూ, న్యాయబద్ధమైన సాక్ష్యం పలకండి. ఇతరుల పట్ల విరోధం ఉన్నా సరే, న్యాయానికి తిలోదకాలు ఇవ్వకండి. ఎల్లప్పుడూ న్యాయంగానే వ్యవహరించండి. దైవభీతి పరాయణతకు ఇది నిదర్శనం. ప్రతివిషయంలోనూ దైవం పట్ల భయభక్తులతో మసలుకోండి. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు(పవిత్ర ఖురాన్ 5-9).
మంచి చెడులు ఒకటి కావు. కనుక అత్యంత శ్రేష్ఠమైన మంచి ద్వారా చెడును నిర్మూలించండి(పవిత్రఖురాన్ 41:34).
ఒకసారి ఒక మనిషి మహమ్మద్ ప్రవక్త మహనీయుల వారివద్దకొచ్చి, ‘దైవప్రవక్తా! ఏ పని చేస్తే స్వర్గం లభిస్తుందో అది ఉపదేశించండి’ అని అడిగాడు. అప్పుడు ప్రవక్త మహనీయులు కొన్ని విషయాలు చెప్పారు. వాటిలో, ‘నీతో శత్రుత్వం నెరిపే బంధుజనులపై నువ్వు కారుణ్యం కురిపించు’ అని సెలవిచ్చారు. అలాగే నిన్ను ప్రేమించే బంధువుల్ని నువ్వు ప్రేమించడం మాత్రమే బంధుప్రేమ కాదు. నిన్ను ప్రేమించని (నిన్ను ద్వేషించే) వారిని ప్రేమించడమే నిజమైన బంధుప్రేమ’ అని కూడా ప్రవచించారు.
అంటే, స్నేహితులతో స్నేహం చేయడం విశేషం కాదు. శత్రువులతో సైతం స్నేహం చేయగలగడం గొప్ప విశేషం. ఒక సందర్భంలో ముహమ్మద్ ప్రవక్త మహనీయులు ఇలా అన్నారు. ‘ఎవర్ని గురించీ చెడుగా మాట్లాడకండి. ఏ చిన్న సత్కార్యాన్నీ అల్పమైనదిగా భావించకండి. మంచి పని ఎంత స్వల్పమైనదైనా దాన్ని చేస్తూనే ఉండండి. తోటివారిని చిరునవ్వుతో పలకరించడం కూడా గొప్ప సత్కార్యమేనని గుర్తుంచుకోండి. కోపాన్ని విసర్జించండి. దాని నుండి దూరంగా పారిపోండి. ఎందుకంటే, కుస్తీలో ప్రత్యర్థిని మట్టి కరిపించే వాడికంటే, ఆగ్రహంలో నిగ్రహం పాటించినవాడే నిజమైన బలవంతుడు, పరాక్రమవంతుడు.
అందుకని ప్రతి ఒక్కరూ సర్వకాల సర్వావస్థల్లో, ఏదోవిధంగా పరులకు మేలు చేయాలన్న సత్సంకల్పం, మంచి ఆలోచన కలిగి ఉండాలి. పగ, ప్రతీకార భావనలను నిఘంటువులోంచి తీసేసి, పరులకు మేలు చేయలేకపోయినా కనీసం కీడు చేయకుండా ఉండడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాలి.
- యండి ఉస్మాన్ఖాన్
దయాగుణంతో దైవప్రీతి
Published Thu, Dec 26 2013 10:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement