చర్మకాంతికి... | buety tips for skin | Sakshi
Sakshi News home page

చర్మకాంతికి...

Apr 28 2016 12:08 AM | Updated on Sep 3 2017 10:53 PM

చర్మకాంతికి...

చర్మకాంతికి...

వేసవిలో చర్మం కమలడం, చమట కారణంగా జిడ్డుగా మారుతుంటుంది.

బ్యూటిప్స్
వేసవిలో చర్మం కమలడం, చమట కారణంగా జిడ్డుగా మారుతుంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ట్యాన్, మొటిమల సమస్య బాధిస్తుంటుంది. ఈ సమస్యల నివారణకు...

 బార్లీ గింజలను నీళ్లలో వేసి, రాత్రంగా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగాలి. అలాగే కొద్దిగా బార్లీ నీళ్లను ముఖానికి రాసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల ఎండ కారణంగా కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. అలాగే మొటిమలు, యాక్నెసమస్యలు తగ్గుతాయి. చర్మం సహజకాంతితో మెరుస్తుంది.

 టీ స్పూన్ బార్లీ పొడిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. ఎండదెబ్బకు కందిపోయిన చర్మానికి జీవకళ తీసుకువస్తుంది.

 ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ చొప్పన ఉల్లి, క్యారెట్ రసం, గుడ్డు సొన, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని యాక్నె, మొటిమలు ఉన్న చోట రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. యాక్నె, మొటిమలు తగ్గి ముఖం కాంతిమంతం అవుతుంది.

 వెల్లుల్లి రెబ్బను చిదిమి, మొటిమ అయిన చోట రాయాలి. అర గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గి, మొటిమల సమస్య బాధించదు.

 ఓట్స్, బాదంపప్పు పొడి, తేనె, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని, వేళ్లతో వలయకారంగా రుద్దుతూ సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత పది నిమిషాలు వదిలేసి, చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం మృదువుగా మారుతుంది.

 ముల్తానీమిట్టి, తేనె, బొప్పాయిపండు గుజ్జు సమభాగాలుగా తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement