టిడిపిని ఓడించాలని యాదవ సంఘం నిర్ణయం
గుంటూరు: టిడిపిని ఓడించాలని యాదవ సంఘం నిర్ణయించింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో రహస్య సమావేశం జరిగింది. టీడీపీని ఓడించడమే తమ ధ్యేయమంటూ మాగంటి సుధాకర్ యాదవ్ తీర్మానం చేశారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన 9 ఏళ్ల పాలనలో యాదవులకు చేసిందేమీలేదని సుధాకర్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో బాబుకు యాదవ సంఘం తరఫున తగిన బుద్ధి చెబుతామని ఆయన అన్నారు.