ఎన్నికల ప్రచారం కోసం, ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్ల (సామాజిక మాధ్యమం)నూ పార్టీలన్నీ పెద్దఎత్తున ఉపయోగిస్తుండటంతో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) దృష్టి సారించింది.
రాజకీయ ప్రకటనలపై ఈసీ కన్ను
వాటి ఖర్చూ అభ్యర్థుల ఖాతాలోకే
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం కోసం, ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్ల (సామాజిక మాధ్యమం)నూ పార్టీలన్నీ పెద్దఎత్తున ఉపయోగిస్తుండటంతో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) దృష్టి సారించింది. చెల్లింపు వార్తలను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సామాజిక మాధ్యమంలో రాజకీయ ప్రకటనలకూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయా ప్రకటనలకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని ‘మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ’ నుంచి అనుమతి తీసుకోవడం సహా పలు నిబంధనలు విధించింది. ఆయా ప్రకటనలపై పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న ఖర్చు లెక్కలనూ తాము అడిగినప్పుడు సమర్పించాల్సి ఉంటుందని సైట్ల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. ఈ సైట్లలో రాజకీయ ప్రకటనల వ్యయం అభ్యర్థుల ఎన్నికల ఖాతాలోకే వస్తుందని పేర్కొంది.
48 గంటలు ‘డ్రై డే’: మద్యాన్ని ఎరగా వేసి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగే 48 గంటలను ‘డ్రై డే’గా ప్రకటించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ ఆదేశించింది.