పాలిటిక్స్ అంతా ‘పవర్’ కోసమే కదా అనుకుంటున్నారా..? నిజమే! ఉత్తరప్రదేశ్లో మాత్రం ‘పవర్’కి పాలిటిక్స్కి ఉన్న లింకే వేరు. రాజకీయ హేమాహేమీల రాష్ట్రమైన యూపీలో ఏటా దాదాపు మూడోవంతు విద్యుత్తుకు ఎలాంటి బిల్లులూ ఉండవు.
విద్యుత్చౌర్యం ఇక్కడ చాలా మామూలు. యూపీలో విద్యుత్ నష్టాలకు సాంకేతిక, ఆర్థిక కారణాలే కావు, రాజకీయ కారణాలూ ఉన్నాయి. మిచిగాన్ వర్సిటీ ఈ అంశంపై నిర్వహించిన అధ్యయనంలో ‘పవర్’ పాలిటిక్స్ గురిం చి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
ఏం తేలిందంటే..
యూపీలో 1970-2010 కాలంలో 29 శాతం విద్యుత్తుకు ఎలాంటి బిల్లులూ వసూలు కాలేదు. కొన్నేళ్లుగా ఎన్ని సంస్కరణలు తెచ్చినా, విధానాల్లో మార్పులు తెచ్చినా పరిస్థితి మరింత దిగజారిందే తప్ప ఎలాంటి మార్పు లేదు. రాజకీయ కుటుంబాలు ఎక్కువగా ఉండే యూపీ పశ్చిమ ప్రాంతంలోనే అత్యధికంగా విద్యుత్ సరఫరా నష్టాలు నమోదయ్యాయి. హత్రాస్, మెయిన్పురి జిల్లాల్లో ఏకంగా 50 శాతం విద్యుత్తు సరఫరాలోనే నష్టపోవడం లేదా బిల్లులు వసూలు కాకపోవడం జరిగింది.
దీనికి భిన్నంగా బహుళజాతి కంపెనీలు ఎక్కువగా ఉన్న గౌతమబుద్ధనగర్ ప్రాంతంలో అత్యల్పంగా 13.8 శాతం విద్యుత్తు నష్టాలు మాత్రమే నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మీటర్లు అమర్చకుండా ఫ్లాట్రేటు పద్ధతిలో బిల్లులు వసూలు చేయడం కూడా నష్టాలకు కారణమవుతోంది. ఎన్నికలకు ముందు గ్రామాలకు రోజుకు 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరిగేది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో 18 గంటలకు పైగా సరఫరా జరుగుతోంది.
గ్రామాలకు విద్యుత్ సరఫరా పెరిగినా, వసూలవుతున్న బిల్లుల మొత్తాలు మాత్రం యథాతథంగానే ఉంటున్నాయి. యూపీలో రాజకీయ దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో, ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు అలహాబాద్ హైకోర్టులో విచారణలో ఉంది. ఓట్లు రాబట్టుకునేందుకు, తమ తమ ప్రాంతాల్లో ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు రాజకీయ నేతలు విద్యుత్తును సాధనంగా ఉపయోగించుకుంటున్నారని మిచిగాన్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రియాన్ మిన్ చెబుతున్నారు.
యూపీలో ‘పవర్’ పాలిటిక్స్...
Published Mon, Apr 28 2014 1:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement