సాక్షి, రంగారెడ్డి జిల్లా : టీఆర్ఎస్ నుంచి ‘హరి’గురి జిల్లాలో అధికంగా తెలుగుదేశం నుంచి వలస పోయారు. వారంతా టీఆర్ఎస్లో చేరారు. టీడీపీ నుంచి వరసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో టీడీపీకి గెలిచే సీన్లేదని డిసైడైన ఆయన కారెక్కారు. స్థానికంగా తెలంగాణ సెంటిమెంటు, దశాబ్ధాలుగా వెన్నంటి నడిచిన అనుచరుల బలంతో మరోసారి శాసన సభ మెట్లెక్కుతాననే ధీమాతో ఉన్నారు. వరుసగా ఎన్నికవుతున్నందున సహజంగానే ప్రజావ్యతిరేకత ఉన్నా.. ఎప్పటికప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న హరీశ్వర్ ఈ సారి మాత్రం గతంలో ఎన్నడూ లేనంత తీవ్రపోటీని ఎదుర్కొంటున్నారు.
మహేందర్రెడ్డిదీ అదేదారి
టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన మరోనేత తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్రెడ్డి. ప్రస్తుతం అదే అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేస్తున్నారు. టీడీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశంలో ఒకప్పుడు ఓ వెలుగువెలిగిన పట్లోళ్ల ఇంద్రారెడ్డి మేనల్లుడే ఈయన. కాలక్రమంలో ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా మహేందర్రెడ్డి టీడీపీని వీడలేదు. కానీ రాష్ట్రవిభజన నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ మునిగిపోయే పడవ అని గుర్తించిన మహేందర్.. గులాబీ గూటికి చేరారు. సహజ ప్రజావ్యతిరేకతను ఎదుర్కొటున్న ఆయన తెలంగాణ సెంటిమెంటుపైనే ఆశలు పెట్టుకున్నారు.
కేఎస్ రత్నం.. మరో యత్నం
చేవెళ్ల శాసనసభా స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న కేఎస్ రత్నం కూడా తొలుత పసుపు పార్టీకి చెందినవారే. అనంతరం పలు పార్టీలు మారినా గత ఎన్నికల్లో తిరిగి టీడీపీ నుంచే చేవెళ్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కారులోనే ప్రయాణిస్తున్న ఆయనకు ఎదురీత తప్పడం లేదు. నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభ కొడిగట్టడం, తెలంగాణ వాదం పెరగడం కలిసొచ్చే అంశాలైనా.. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో కాస్త సహజ వ్యతిరేకత కూడా ఉంది. ఇక చేవెళ్ల స్థానంలో టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం క్షేత్ర స్థాయిలో బలంగా లేకపోవడం రత్నానికి ఓ ప్రతికూలత. ఈ సారి సెంటిమెంటే గట్టెక్కిస్తుందని గట్టి నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.
మైనంపల్లి.. అలా వెళ్లి..
ఇక మల్కాజిగిరి పార్లమెంటుకు టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న మైనంపల్లి హనుమంతురావు కొద్ది రోజుల క్రితం వరకూ టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గరి మనిషి. గతంలో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి ఈ సారి కోరిన టికెట్ లభించని కారణంగా వయా కాంగ్రెస్.. గులాబీ గూటికి చేరారు. మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ కోసం పార్టీలు మారిన ఆయన.. చివరికి టీఆర్ఎస్ నుంచి లోక్సభ అభ్యర్థి అయ్యారు. ఏ పార్టీ అయినా ఫర్వాలేదు.. మల్కాజిగిరి నుంనే పోటీ చేయాలనే పట్టుదలతో టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నారు.
అయితే లోక్సభ అభ్యర్థిగా విజయం సాధించడం మైనంపల్లికి కత్తి మీదసామే. దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానమైన మల్కాజిగిరిలో తెలంగాణ సెంటిమెంట్ తక్కువ. కేవలం దాన్ని మాత్రమే నమ్ముకుంటే విజయం దక్కదని తెలిసే హనుమంతు అనేక వ్యూహాలతో ముందుకుసాగుతున్నారు. సెటిలర్ల ఎంతో కీలకమైన ఈ స్థానంలో ఎదురీదుతున్న హనుమంతుకు.. తాజాగా టీఆర్ఎస్ కీలక నేతలు సెటిలర్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మరింత తలనొప్పిగా మారింది.
అదేవిధంగా మల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి బీజేపీ తరఫున పోటీలో ఉన్న చింతల కనకారెడ్డి గత ఎన్నికల్లో పీఆర్పీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి ఆ పార్టీ తరఫున పోటీ చేసినవారే. విజయంపై అనేక లెక్కలు వేసుకుని జెండాలు మార్చిన వీరంతా విజయభావుటా ఎగురవేస్తారో లేదోనన్నది ఎన్నికల ఫలితాలు వెలువడితేగానీ తేలదు.
కండువాలు మార్చారు.. కలిసొస్తుందా!
Published Wed, Apr 23 2014 11:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement