వారణాశిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం భారీ రోడ్డు షో నిర్వహించారు.
వారణాశి: వారణాశిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం భారీ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్బంగా మోడీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం వారణాశిలో ఆమ్ ఆద్మీ సంచలనం సృష్టించబోతోందని జోస్యం చెప్పారు.
గురువారం మోడీ రోడ్డు షో ప్రారంభించిన బెనారస్ హిందూ యూనివర్సిటీ వద్ద నుంచే కేజ్రీవాల్ రోడ్డు షో కూడా ఆరంభమైంది. మోడీ వివాదాలు సృష్టిస్తున్నారని, అలాంటి వ్యక్తులకు ఓటు వేయెద్దంటూ కేజ్రీవాల్ కోరారు.


