నగరంలోని రామవరప్పాడులో ఓ యువతి(24) ఇంటి యజమాని కుమారుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
విజయవాడ(పడమట): నగరంలోని రామవరప్పాడులో ఓ యువతి(24) ఇంటి యజమాని కుమారుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ యుతిపై ఏడాదికాలంగా ఇంటి ఓనర్ కుమారుడు రాఘవేంద్ర అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అత్యాచారాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించాడు.
వాటిని తన స్నేహితులకు పంపించాడు. దీంతో వారు ఆ వీడియోను బాధితురాలికి చూపించి డబ్బులు ఇవ్వాలని బెదిరించే ప్రయత్నం చేశాడు. దీనిని ప్రతిఘటించేందుకు ఆమె ప్రయత్నం చేయడంతో ఆమె ఇంటిపై దాడి చేసి గాయపరిచారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉన్నారు.