చెట్టును ఢీకొట్టిన కారు.. మహిళ మృతి | women dies in road accident in guntur district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొట్టిన కారు.. మహిళ మృతి

Jul 20 2016 11:05 AM | Updated on Aug 30 2018 4:07 PM

కొడుకును ఉన్నత చదువుల కోసం పంపించి తిరిగి వస్తున్న దంపతుల వాహనం ప్రమాదానికి గురైంది.

వినుకొండ(గుంటూరు): కొడుకును ఉన్నత చదువుల కోసం పంపించి తిరిగి వస్తున్న దంపతుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా వినుకొండ శివారులోని విఠంరాజుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది.

వినుకొండకు చెందిన వెంకట శ్రీనివాసరావు దంపతులు కుమారుడిని విశాఖలోని హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో చేర్పించి కారులో తిరిగి వస్తుండగా.. కారు విఠంరాజుపల్లి వద్దకు రాగానే ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన భార్య శ్రీదేవి(35) అక్కడికక్కడే మృతిచెందగా, శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement