మహిళ ఆత్మహత్య | Woman commits suicide | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

Feb 27 2017 4:28 AM | Updated on Sep 5 2017 4:41 AM

అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మారేడ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

కంటోన్మెంట్‌: అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మారేడ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. చిలకలగూడకు చెందిన అబ్దుల్‌ సుభాన్, నజీమిన్‌ భాను దంపతుల కుమార్తె షాబాజ్‌ ఫాతిమా (23) గోల్డెన్‌ బేకరీ యజమాని సయ్యద్‌ ఇంతియాజ్‌ను పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత ఇంతియాజ్, భార్య ఫాతిమా, అత్తమామలతో కలిసి వెస్ట్‌మారేడ్‌పల్లిలో కాపురం పెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు  ఇంతియాజ్‌ తమ కూతురిని వేధించేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

దీంతో ఫాతిమా తల్లిదండ్రులు చిలకలగూడలోని తమ సొంతింటికి వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఇంతియాజ్‌ శనివారం ఫాతిమా తల్లిదండ్రులను  తన ఇంటికి ఆహ్వానించాడు. ఈ సందర్భంగా మరోసారి గొడవజరిగిందని తెలిపారు. శనివారం రాత్రి తాము చిలకలగూడకు వెళ్లిపోగా, ఆదివారం తెల్లవారుజామున  అల్లుడు ఇంతియాజ్‌ తమకు ఫోన్‌ చేసి, ఫాతిమా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడన్నారు. దానిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫాతిమా తల్లి నజీమిన్‌ భాను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement