ఆయనెవరు? | Who is he? | Sakshi
Sakshi News home page

ఆయనెవరు?

Nov 22 2015 2:10 AM | Updated on Aug 10 2018 8:16 PM

ఆయనెవరు? - Sakshi

ఆయనెవరు?

ఆయనెవరు?... ప్రస్తుతం ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. గత ఏడాదిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో

ఆయనెవరు?... ప్రస్తుతం ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. గత ఏడాదిలో జరిగిన సాధారణ  ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధికారం చేపట్టింది. ఫలితాలు వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారానికంటే ముందే గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పాటు చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందుగానే నిర్ణయించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు పోటీ పడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎకరాల కొద్ది భూమిని తమతో పాటు బంధువులు, అనుచరుల పేర్లమీద రైతుల నుంచి పదో పరకో చెల్లించి కొనేశారు. అయితే పార్టీ ప్రముఖుడు ఒకరు వీరందరి బాటలో నడవలేదట.

రాజధానిలో భూములు కొనటం కంటే ఇతర ప్రాంతాల్లో దృష్టి సారించటం బెటరని భావించారట.  అలా అనుకున్నదే తడవుగా ఖండాలు దాటి భూములు కొనుగోలు, అమ్మకాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారట. అందులో భాగంగా  ఆస్ట్రేలియాలో ఒకేసారి నాలుగొందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారట.  ఆ భూమి విలువ  సుమారు ఆరొందల కోట్లు ఉంటుందట. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అంత పెద్ద మొత్తం వెచ్చించి ఆయన భూములు కొనుగోలు చేసిన విషయం మెల్లగా బయటకు పొక్కింది. అయితే పార్టీ ముఖ్యులకు మాత్రమే ఈ విషయం తెలియటంతో వారు ఇదే విషయాన్ని నెమ్మదిగా  తమ అలవాటులో భాగంగా లీక్ చేశారు. అయితే ఆయన పేరు మాత్రం బైటకు  చెప్పలేదు. ఆయన జిల్లా పేరు మాత్రం వెల్లడించారు. దీంతో ఇంతకు ఆ నేత ఎవరంటూ పార్టీ నేతలు ఎన్‌టీఆర్  భవన్‌లో చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement