హత్యకు గురైన యువతి తండ్రికి కుల బహిష్కరణ
- గతేడాది అత్యాచారం.. హత్యకు గురైన కూతురు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
- హంతకుడితో రాజీపడాలన్న గ్రామ పెద్దలు
- జంగరాయి గ్రామ పెదరాయుళ్ల తీరు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/చిన్న శంకరంపేట: ఆ తండ్రి ఒక్కగానొక్క కూతురును అత్యంత పాశవికంగా ఓ మృగాడు హత్యచేశాడు.. ఆమె పై అత్యాచారం చేసి, ఆపై కత్తులతో పొడిచి.. పొడిచి చంపేశాడు. శవాన్ని డ్రమ్ములో కుక్కి అడవిలో విసిరేశాడు. తన కూతుర్ని చంపిన కిరాతకుడిని శిక్షపడాలని ఆ తండ్రి కోర్టులు, ఠాణాల చుట్టూ తిరుగుతుంటే, గ్రామ పెదరాయుళ్లు మాత్రం రివర్స్లో వచ్చారు. హంతకుడితో రాజీపడాలంటూ మృతురాలి తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. లెక్కచేయని మృతురాలి తండ్రిని కుల బహిష్కరణ చేశారు. తీర్పును ఉల్లంఘించిన వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన చెరుకు దుర్గారెడ్డి కూతురు మౌనిక (22) గతేడాది మేలో ఇంటికి వచ్చింది.
మూడు రోజులపాటు ఇంట్లోనే ఉన్న మౌనిక అదేనెల 13న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు అదేనెల 16న మెదక్ మండలం రాయిన్పల్లి అటవీప్రాంతంలో శవమై కన్పించింది. మౌనికపై అత్యాచారం చేసి, కత్తులతో పొడిచి, మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో కుక్కి అటవీప్రాంతంలో విసిరేసి పోయారు. ఈ కేసుపై విచారణ జరిపిన మెద క్ రూరల్ పోలీసులు అదే గ్రామానికి చెందిన ఎం. రాంరెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి, అతనిపై హ త్యానేరం కేసు నమోదు చేశారు. పోలీసుల నుంచి తప్పిం చుకు తిరగుతున్న రాంరెడ్డిని ఏపీ గుంటూరు జిల్లాలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
హంతకుడికి భార్య, ఇద్దరు పిల్లలు, జంగరాయిలో 4 ఎకరాల పొలం ఉంది. బెయిల్పై బయటికి వచ్చినప్పటికీ రాంరెడ్డి ఊరుకు దూరంగానే ఉన్నాడు. పొలాన్ని దున్నటానికి ఎవరూ ముందుకు రాకపోవటంతో బీడుపడింది. కాగా ఇటీవల రాంరెడ్డి కొంతమంది గ్రామ పెద్దలను కలిసి మృతురాలు తండ్రి దుర్గారెడ్డికి, తనకు మధ్య రాజీ కుదర్చాల న్నాడు. కులపెద్దలు దుర్గారెడ్డిని పిలిచి పంచా యితీ పెట్టారు. పంచాయితీలో రాంరెడ్డి తప్పు చేశాడని నిర్ధారించారు. అతను చేసిన తప్పుకు శిక్షగా రూ 1.5 లక్షలు జరిమానా విధిస్తామని, కేసులో రాజీపడాలని కులపెద్దలు దుర్గారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. తన కూతురును హత్య చేసిన వ్యక్తితో రాజీపడేదిలేదని చెప్పి గ్రామపెద్దల మాటను దుర్గారెడ్డి తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన కులపెద్దలు దుర్గారెడ్డి కుటుం బాన్ని కుల బహిష్కరణ చేశారు. ఊరిలో ఆయన కుటుంబానికి ఎవరైనా సహకరిస్తే వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
తీర్పు తక్షణమే అమల్లోకి...
ఈ తీర్పుతో ఎంగిలి పూల బతుకమ్మ పండుగ రోజు దుర్గారెడ్డి భార్య లక్షి బతుకమ్మను తీసుకొని వెళ్లగా.. తోటి మహిళలు ఆమెను కలవనివ్వలేదు. మరోవైపు దుర్గారెడ్డి కొడుకు పెళ్లికి ముహుర్తం కూడా పెట్టుకున్నాడు. గ్రామపెద్దల తీర్పుతో ఈ పెళ్లి పనులకు గ్రామస్తులు ఎవరూ సహకరించడం లేదు.
సంపినోడికి శిక్షపడాల్సిందే
నా బిడ్డను చంపిన హంతకుడితో రాజీపడితే నాకు రూ. 1.5 లక్షలు ఇప్పిస్తామని మా గ్రామ పెద్దలు నాపై ఒత్తిడి తెచ్చారు. నా బిడ్డే పోయినంక.. ఇక ఈ డబ్బు నాకు ఎందుక న్నా.. నా బిడ్డను చంపిన హంతకుడు వాడు, వానికి శిక్ష పడాలని చెప్పిన.. నా మాటలు త ప్పట.. అంతా కలిసి నన్ను, నా కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు. - దుర్గారెడ్డి
కౌన్సిలింగ్ చేశాం : ఎస్ఐ
గ్రామ పెద్దల తీర్పుపై దుర్గారెడ్డి చిన్నశంకరంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎస్సైను వివరణ కోరగా.. ఫిర్యా దు అందిన మాట నిజమేనన్నారు. గ్రామంలోని కులపెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ చేశామని చెప్పారు. అయినా వారిలో మార్పు రాకపోతే కేసులు నమోదు చేస్తామని అన్నారు.
గ్రామపెద్దల ఆటవిక తీర్పు..
Published Wed, Oct 5 2016 6:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement