మార్టూరు మండలం గన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
మార్టూరు మండలం గన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కొంగలను పట్టుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ కొక్కిలి కుంటలో పడి చనిపోయారు. మృతులు ప్రభుదాస్(25), సూరయ్య(19)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.