- లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
- మాంసపు ముద్దలా మృతదేహాలు
నల్లమాడ : ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్ఐ కె.గోపి తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పులగంపల్లి సమీపాన కదిరి–హిందూపురం రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటాగుళ్ల తారకరామనగర్కు చెందిన మూడే మహేష్నాయక్(24), నల్లచెరువు మండలం బాలేపల్లికి తండాకు చెందిన భూక్యా రమేష్నాయక్(24) అక్కడికక్కడే మృతి చెందారు.
ఆటో కంతు చెల్లించేందుకు వెళ్లి..
సమీప బంధువులైన వీరు హిందూపురంలో ఆటో కంతు (ప్రీమియం) చెల్లించి ద్విచక్ర వాహనంలో కదిరికి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో పులగంపల్లికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని రోడ్డు మలుపులో కదిరి వైపు నుంచి ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని బలంగా ఢీకొట్టారు. లారీ కుడివైపు, ద్విచక్ర వాహనం ముందు వైపు నుజ్జునుజ్జు అయ్యాయి. ద్విచక్ర వాహనం లారీ కింద ఇరుక్కుపోవడంతో.. మహేష్నాయక్, రమేష్నాయక్ మీదుగా లారీ కుడివైపు ముందు చక్రం దూసుకెళ్లింది. దీంతో మహేష్నాయక్ తల ఛిద్రమయింది.
రమేష్నాయక్ ఎడమకాలు తొడవద్దకు విరిగిపోయి మృతదేహాలు మాంసం ముద్దల్లా తయారయ్యాయి. సమాచారం అందిన వెంటనే నల్లమాడ, అమడగూరు ఎస్ఐలు కె.గోపీ, చలపతి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాకీ సాయంతో లారీని పైకి లేపి మృతదేహాలను, ద్విచక్ర వాహనాన్ని బయటకు తీశారు. కదిరి పట్టణ సీఐ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులిద్దరికీ భార్య, కూతరు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు.
ఇద్దరు యువకుల దుర్మరణం
Published Tue, May 30 2017 11:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement