టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే పెద్దగట్టు అభివృద్ధి | TRS government development seriously | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే పెద్దగట్టు అభివృద్ధి

Feb 16 2017 1:08 AM | Updated on Sep 5 2017 3:48 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే దురాజ్‌పల్లి పెద్దగట్టు అభివృద్ధి జరిగిందని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్‌ అన్నారు.

చివ్వెంల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే దురాజ్‌పల్లి పెద్దగట్టు అభివృద్ధి జరిగిందని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్‌ అన్నారు. బుధవారం దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన లింగమంతుల స్వామి జాతరకు సీఎం కేసీఆర్‌ సహకారంతో మంత్రి జగదీశ్‌రెడ్డి రూ.3కోట్ల అభివృద్ధి పనులు చేశారన్నారు.కార్యక్రమంలో ఎంపీపీలు వట్టె జానయ్యయాదవ్, మల్లికార్జున్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ సుంకరబోయిన శ్రీనివాస్‌యాదవ్, తంగెళ్ల జితేందర్‌రెడ్డి, నెమ్మాది భిక్షం, నూకల వెంకట్‌రెడ్డి,  వెంకటి, మధుసూదన్‌రెడ్డి,   గురూజీ, కోడి సైదులుయాదవ్,  జానయ్యయాదవ్, రవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement