శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనలు రావడంతో.. ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి వచ్చారు.
జిల్లాలోని ఎచ్చర్ల, పొందూరు, అరసవెల్లి పరిసర ప్రాంతాల్లో మూడు సెకన్ల పాటు కంపించింది. దీంతో స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.