హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్‌ సీజ్‌ | tractor seezed which used in murder | Sakshi
Sakshi News home page

హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్‌ సీజ్‌

May 22 2017 11:16 PM | Updated on Jul 30 2018 8:37 PM

హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్‌ సీజ్‌ - Sakshi

హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్‌ సీజ్‌

వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడులను హతమార్చేందుకు వినియోగించిన ఏ1 నిందితుడు చెరుకులపాడుకు చెందిన కురువ రామాంజనేయులు ట్రాక్టర్‌ను సోమవారం తెల్లవారుజామున రామకృష్ణాపురం సమీపంలో పట్టుకున్నట్లు ఎస్‌ఐ సోమ్లానాయక్‌ తెలిపారు.

– అదుపులో ఇద్దరు వ్యక్తులు
 
కృష్ణగిరి: వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడులను హతమార్చేందుకు వినియోగించిన ఏ1 నిందితుడు చెరుకులపాడుకు చెందిన కురువ రామాంజనేయులు ట్రాక్టర్‌ను సోమవారం తెల్లవారుజామున రామకృష్ణాపురం సమీపంలో పట్టుకున్నట్లు ఎస్‌ఐ సోమ్లానాయక్‌ తెలిపారు. ముందస్తు సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామని, అయితే ఈ ట్రాక్టర్‌పై ఎరుకలచెర్వుకు చెందిన చంద్ర, చెరుకులపాడుకు చెందిన పెద్దయ్య వస్తున్నారని.. అనుమానంతో వీరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఈ ట్రాక్టర్‌కు ఎలాంటి నెంబర్‌ లేకపోగా.. ఇంకా రిజిస్ట్రేషన్‌ కూడా చేయించనట్లు తెలుస్తోం‍ది.  ట్రాక్టర్‌ ముందు భాగం వాహనాన్ని ఢీకొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హత్యలకు ఉపయోగించిన మరో ట్రాక్టర్‌ను పట్టుకోవాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement