కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఆదివారం సాయంత్రం పొగాకు గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది.
-రూ. 30 లక్షల ఆస్తి నష్టం
కంచికచర్ల(కృష్ణాజిల్లా)
కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఆదివారం సాయంత్రం పొగాకు గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది. వసంత సత్యనారాయణ అనే వ్యక్తికి చెందిన గోడౌన్లో రైతులు పొగాకు గ్రేడింగ్ చేసి నిల్వ ఉంచుతారు. ఆదివారం సాయంత్రం గోడౌన్ పక్కనున్న పొలంలో ఎండుగడ్డికి నిప్పు పెట్టడంతో మంటలు గోడౌన్కు పాకి పొగాకు బేళ్లు దగ్ధమవుతున్నాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ఇంజన్ వచ్చి మంటలు ఆర్పుతున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.