సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరిట రూ. 370.41 కోట్లు ఖర్చు చేసి పేదలకు ఉచితంగా సరుకులు పంపిణీ చేసినా ఇటు పేదల్లోనూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంతోషం లేకుండా పోయింది. పండుగ పూట ఉన్నత వర్గాలతో సమానంగా పేదలు సైతం తమ కుటుంబ సభ్యులతో కలిసి నెయ్యితో కూడిన పిండి వంటలు తిని సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆరు రకాల వస్తువులను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కాసులకు కక్కుర్తిపడి నాసిరకం సరుకులు పంపిణీ చేశారు. దీంతో చాలా మంది పేదలు వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
తెల్లరేషన్ కార్డున్న ప్రతి లబ్దిదారుడికి రూ. 270లు విలువ చేసే అరకిలో కందిపప్పు, అర లీటర్ పామాయిల్, అర కిలో శనగపప్పు, అర కిలో బెల్లం, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యి ఉచితంగా ఇచ్చినా వాటిలో బెల్లం కరిగిపోయి వినియోగించుకోవడానికి వీల్లేకుండా పోయింది. దీనికి తోడు పొట్టుతో కూడిన గోధుమపిండి సరఫరా చేశారు. చంద్రన్న కానుక పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఉన్న బ్యాగులో నాసిరకం సరుకులను పేదలకు కట్టబెట్టారు. నాసిరకం సరుకులు ఇవ్వడం వల్ల వాటిని పేదలకు ఉపయోగపడలేదని క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తెప్పించుకున్న సీఎం నా ఫోటో ఉన్న బ్యాగులో ఇలాంటి సరుకులు పంపిణీ చేసి తన పరువు తీశారంటూ ఇటీవల నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల సమయం ఇచ్చినా నాణ్యమైన సరుకులు ఇవ్వకుండా ముఖ్యమంత్రికి సంతోషం లేకుండా చేశారు.
సరుకులిచ్చినా సంతోషం ఏదీ?
Published Sun, Jan 31 2016 3:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement