పోరాటాల ఫలితంగానే కూలి పెంపు | The struggle to increase wages | Sakshi
Sakshi News home page

పోరాటాల ఫలితంగానే కూలి పెంపు

Jul 29 2016 10:42 PM | Updated on Sep 4 2017 6:57 AM

చేనేత సమస్యలపై అఖి ల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఖిలావరంగల్‌ :  చేనేత సమస్యలపై  అఖి ల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం శివనగర్‌ తమ్మెర భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. చేనేత కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా చేనేత కార్మిక సహకార సొసైటీ(టెస్కో) 20 నుంచి 27 శాతానికి కూలి రేట్లు పెంచిందన్నారు. మీటరు నేత కు రూ.3 50 పైసలు, టెరికాటన్‌ షూటింగ్‌ క్లాత్, షర్టింగ్, లంగా, పాలిస్టర్‌ బ్లౌజ్, ఓణీ క్లాత్‌ నేతకు రూ.4. 50 పైసలు పెరిగాయ ని తెలిపారు. జౌళిశాఖ నుంచి చేనేతను విడదీసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే కార్మికులు పో రాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో గోరంట్ల శరత్‌బాబు, చె రుకు వెంకట్రాం నర్సయ్య, గుల్లపెల్లి సాం బమూర్తి,  సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement