సాక్షి, అనంతపురం: అనంతపురం టీడీపీ కార్యాలయంలో మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరు బట్టబయలైంది. మహిళా నేతలు.. రెండు వర్గాలుగా విడిపోయారు. సంగా తేజశ్వణి - సరళ వర్గాలు పరస్పరం బూతులు తిట్టుకున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ మహిళా నేతల బూతు పురాణం వైరల్గా మారింది.
టీడీపీకి చెందిన మహిళా నేతల మధ్య కొన్ని రోజలుగా వార్ కొనసాగుతోంది. పార్టీ కార్యాలయం వేదికగా రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు సంఘా తేజశ్వణి, మాజీ కార్పొరేటర్ సరళాలు ఒకరినొకరు దూషించుకున్నారు. అసభ్య పదజాలంతో మాటల యుద్ధం సాగించారు. సర్దిచెప్పేందుకు పలువురు మహిళలు ప్రయత్నించిన ఏమాత్రమూ వినకుండా వాదనలకు దిగారు.


