'సీఎం అలా చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు' | tammineni seetaram criticises cm kcr on thotapally project | Sakshi
Sakshi News home page

'సీఎం అలా చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు'

Sep 11 2015 5:40 PM | Updated on Jul 11 2019 9:04 PM

'సీఎం అలా చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు' - Sakshi

'సీఎం అలా చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు'

తోటపల్లి ప్రాజెక్టు ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ దేనని వైఎస్ఆర్ సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.

శ్రీకాకుళం : తోటపల్లి ప్రాజెక్టు ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ దేనని వైఎస్ఆర్ సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తోటపల్లి ప్రాజెక్టును తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

తోటపల్లి ప్రాజెక్టుకు మహానేత వైఎస్ఆర్ రూ.450 కోట్లు విడుదల చేస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం రూ.50 కోట్లు విడుదల చేశారని విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్టు అంశంపై టీడీపీ నేతలు, సీఎం చంద్రబాబు చర్చకు రావాలంటూ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు.

Advertisement
 
Advertisement
Advertisement