తాడూరు: ప్రస్తుత ఖరీఫ్లో రైతులు సాగు చేసిన పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఇన్సూరెన్స్ చేసుకోవాలని వ్యవసాయాధికారిణి నీతి తెలిపారు.
పంటలకు ఇన్సూరెన్స్ చేసుకోవాలి
Jul 24 2016 6:52 PM | Updated on Sep 4 2017 6:04 AM
తాడూరు: ప్రస్తుత ఖరీఫ్లో రైతులు సాగు చేసిన పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఇన్సూరెన్స్ చేసుకోవాలని వ్యవసాయాధికారిణి నీతి తెలిపారు. ఎకరాకు వరికి రూ.560, మొక్కజొన్న రూ.400, మిర్చి యూ–1 రకం రూ.1200, మిర్చి–1 రకం రూ.వెయ్యి, కందులు రూ.260, పెసర రూ.200, వేరుశనగ యూ–1కు రూ.320, వేరుశనగ–1 రకానికి రూ.360 వంతున బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పేరున డీడీ తీయాలని పేర్కొన్నారు. రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించడంలో ఎలాంటి సందేహాలున్నా సెల్ నం.9603322481 సంప్రదించవచ్చని, జూలై 30లోపు బీమా చెల్లించుకోవాలని సూచించారు.
Advertisement


