తెలంగాణ సర్కారుకు సుప్రీం నోటీసులు | supreme court notices to telangana government over palamuru dindi projects | Sakshi
Sakshi News home page

తెలంగాణ సర్కారుకు సుప్రీం నోటీసులు

May 6 2016 1:42 PM | Updated on Mar 22 2019 2:57 PM

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-డిండి ప్రాజెక్టులపై ఏపీ రైతులు శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-డిండి ప్రాజెక్టులపై ఏపీ రైతులు శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ ప్రయోజనాలు భంగం కలిగించే విధంగా ప్రాజెక్టులు ఉన్నాయంటూ వారు పిటిషన్‌లో దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను జులై 20కి వాయిదా వేశారు. తుది వాదనలు ఆరోజే వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement