పట్టణానికి చెందిన కవి, జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు జోగు అంజయ్యకు అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘తొలిపొద్దు’ శీర్షికన 442 మంది కవుల కవితలను పుస్తకరూపంగా ప్రచురించారు.
‘తొలిపొద్దు’లో జోగు అంజయ్య కవితలు
Aug 1 2016 2:22 AM | Updated on Sep 4 2017 7:13 AM
జనగామ : పట్టణానికి చెందిన కవి, జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు జోగు అంజయ్యకు అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘తొలిపొద్దు’ శీర్షికన 442 మంది కవుల కవితలను పుస్తకరూపంగా ప్రచురించారు. కాగా, ఇందులో ‘ముఖారవిందం’ పేరిట జోగు అంజయ్య రచించిన కవిత్వానికి సైతం చోటు లభించింది. తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది.. అనే కోణంలో ఆయన ఈ కవిత్వాన్ని రాయడం గమనార్హం.
Advertisement


