ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహా న్ని ఏర్పాటుచేయాలి | sarvai papanna statue formation in tank bund | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహా న్ని ఏర్పాటుచేయాలి

Aug 3 2016 7:23 PM | Updated on Sep 4 2017 7:40 AM

ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహా న్ని ఏర్పాటుచేయాలి

ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహా న్ని ఏర్పాటుచేయాలి

సూర్యాపేట : ట్యాంక్‌బండ్‌పై సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, బస్సుయాత్ర కన్వీనర్‌ ఎంవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సూర్యాపేట : ట్యాంక్‌బండ్‌పై సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, బస్సుయాత్ర కన్వీనర్‌ ఎంవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం వరంగల్‌ జిల్లా కిలాషాపురంలో ప్రారంభమైన బస్సుయాత్ర నల్గొండ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు తిరుగుతూ సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా గాంధీపార్కులో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం నూతన కల్లు విధానాన్ని రూపొందించి కల్లుగీత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు. సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పి మీరా ప్రాజెక్టును నిర్మించాలన్నారు. ఆగస్టు 18 వరకు ప్రభుత్వం గీత కార్మికులు పెట్టిన డిమాండ్‌లు పరిష్కారం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులను కదిలించి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంతకుముందు పట్టణంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి గౌడకులస్తులు, మోకుముస్తాదులతో, తాటిమట్టలతో పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు గోపగాని వెంకట్‌నారాయణగౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజుగౌడ్, ఎల్గూరి గోవింద్, వర్ధెల్లి బుచ్చిరాములు, జలగం శ్రీనివాస్, బూడిద గోపి, ఉయ్యాల నగేష్, జ్యోతి, లక్ష్మణ్‌గౌడ్, బైరు వెంకన్నగౌడ్, కసగాని లక్ష్మి, బైరు శైలేందర్‌గౌడ్, పొలగాని బాలుగౌడ్, జెర్రిపోతుల కృష్ణ, మడ్డి అంజిబాబు, కృష్ణ, మట్టిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement