కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం రుద్రారం గ్రామ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను పోలీసులు పట్టుకున్నారు.
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం రుద్రారం గ్రామ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను పోలీసులు పట్టుకున్నారు. లారీలను స్వాధీనం చేసుకుని మైనింగ్ అధికారులకు అప్పగించనున్నట్లు వేములవాడ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.