నీరిచ్చే కార్మికులకు కంటనీరు | Salary's due from last six months | Sakshi
Sakshi News home page

నీరిచ్చే కార్మికులకు కంటనీరు

Nov 17 2016 2:26 AM | Updated on Sep 4 2017 8:15 PM

నీరిచ్చే కార్మికులకు కంటనీరు

నీరిచ్చే కార్మికులకు కంటనీరు

జిల్లా వ్యాప్తంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటైన సామాజిక రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో పని చేస్తున్న 350 మంది కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించని పరిస్థితి నెలకొంది.

వారు అందరికీ తాగునీరు సరఫరా చేసే విషయంలో తమ వంతు బాధ్యతయుతమైన విధులు నిర్వహిస్తారు... కానీ వారు కంటతడి పెడతారు. వారి కంటతడికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. వారికి చెల్లించాల్సిన వేతనాలను సకాలంలో చెల్లించక ఆరు నెలలుగా అవస్థల పాల్జేస్తుంది. ఎన్నిసార్లు తమ వేతనాల కోసం అధికారులు, పాలకులకు విన్నవించినా ప్రయోజనం లేకపోతుంది. చివరకు వారికి కన్నీరే మిగులుతుంది. వారే రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో పని చేస్తున్న వాచ్‌మెన్లు, ఎలక్ట్రీషియన్లు. వివరాల్లోకి వెళ్తే...
 
 ఆరు నెలలుగా అందని జీతాలు
జిల్లాలో రూ.4.5కోట్లు బకారుులు
350 మంది వాచ్‌మెన్‌లు, ఎలక్ట్రీషియన్ల ఆవేదన
నిధులివ్వని రాష్ట్ర ప్రభుత్వం  

 
శ్రీకాకుళం టౌన్: జిల్లా వ్యాప్తంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటైన సామాజిక రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో పని చేస్తున్న 350 మంది కార్మికులకు ఆరు నెలలుగా  జీతాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ నీటి సరఫరా విభాగానికి నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. సుమారు రూ.4.5కోట్ల మేర బకారుులు విడుదల చేయకపోవడంతో కార్మికులకు జీతాలు చెల్లించడం లేదు. ఇందులో పంపు ఆపరేటర్లు, వాల్వ్ ఆపరేటర్లు, వాచ్‌మెన్‌లు, ఎలక్ట్రీషియన్లకు జీతాలు అందడం లేదు. దీంతో వారి కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 1100 గ్రామ పంచాయతీల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దాహార్తిని తీర్చడానికి  34 సామాజిక రక్షిత పథకాలు నెలకొల్పారు.

టెక్కలి డివిజన్‌లో ఉద్దానం రక్షిత మంచినీటి పథకం, శ్రీకాకుళం డివిజన్‌లో శాలిహుండం వాహన రక్షిత మంచినీటి పథకం, పాలకొండ డివిజన్‌లో రాజాం-సారధి రక్షిత మంచినీటి పథకాలను కలిపి 34 చిన్న, పెద్ద రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేశారు. నిరంతరం గ్రామీణ ప్రాంత ప్రజలకు నదీ పరివాహక ప్రాంతాల్లోను, చెరువులు, వాగుల్లో ఉన్న నీటిని శుద్ధి చేసి గ్రామాలకు సరఫరా చేసేందుకు ఈ పథకాలను ఏర్పాటు చేశారు. ఈ పథకాలను గ్రామీణ నీటి సరఫరా విబాగం నిర్వహిస్తోంది. వేసవిలో సహితం తాగునీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకాల నిర్వహణకు పంపు ఆపరేటర్లు, వాల్వ్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్‌మెన్‌లు కలిపి సుమారు 350 మంది కార్మికులు ఈ పథకాల వద్ద నిరంతరాయంగా పని చేస్తున్నారు. తాత్కాలిక పద్ధతిలో వీరిని నియమించిన ప్రభుత్వం నెలవారీ జీతాలను గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగించారు. ఈ పథకాలు నిర్వహణ సిబ్బందికి ఆరు నెలల కిందట వరకు ఎప్పటికప్పుడు జీతాలు విడుదల చేసేవారు.

కానీ ప్రస్తుతం ఆరు నెలలుగా నిధులు విడుదల చేయక అవస్థలు పడుతున్నారు. బడ్జెట్‌లో ఏటా రూ.4.5కోట్లు కార్మికుల జీతాలకు వినియోగిస్తున్నారు. విద్యుత్ చార్జీలు, ఇతర అవసరాలకు మరికొంత నిధులు అవసరమవుతారుు. కాని ప్రభుత్వం ఆరు నెలలుగా ఈ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఈ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తక్కువ జీతానికి పని చేస్తున్న కార్మికులకు నెలవారీ జీతాలు చెల్లించకపోవడం వల్ల పస్తులు ఉండాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు.

ప్రభుత్వానికి అంచనాలు పంపించాం
రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు ప్రతి ఏటా రూ.12కోట్లు మెరుుంటెనెన్సు నిధులు అవసరమవుతారుు. కార్మికుల జీతాలతో పాటు విద్యుత్ చార్జీలు, తాత్కాలిక మరమ్మతులకు అవసరమైన నిధుల కోసం ఈ ఏడాది అంచనాలు పంపించాం. 2016-17 ఆర్థిక సంవత్సరానికి నిధులు రావాల్సి ఉంది. విడుదలైతే జీతాల చెల్లింపునకు వీలుం టుంది. చిన్న తరహా పథకాలకు గ్రామ పంచాయతీలే విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు చెల్లిస్తారు. కాని సీడబ్ల్యూ రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు కావాల్సి ఉంటుంది. మెరుుంటినెన్సు నిధులు విడుదల చేస్తే జీతాలు చెల్లిస్తాం.      -శ్రీనివాసులు, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement