షాపులో రూ.15 లక్షల చోరీ | Rs.15laksh theft in a shop | Sakshi
Sakshi News home page

షాపులో రూ.15 లక్షల చోరీ

Jul 29 2016 10:23 PM | Updated on Sep 4 2017 6:57 AM

షాపులో రూ.15 లక్షల చోరీ

షాపులో రూ.15 లక్షల చోరీ

గుంటూరు ఈస్ట్‌ : షాపు తాళాలు పగులకొట్టి రూ.15 లక్షల నగదు చోరీ చేసిన సంఘటన గురువారం రాత్రి పల్లవి థియేటర్‌ సమీపంలోని సాంబశివపేటలో చోటుచేసుకుంది.

 
గుంటూరు ఈస్ట్‌ : షాపు తాళాలు పగులకొట్టి రూ.15 లక్షల నగదు చోరీ చేసిన సంఘటన గురువారం రాత్రి పల్లవి థియేటర్‌ సమీపంలోని సాంబశివపేటలో చోటుచేసుకుంది. కొత్తపేట ఎస్‌హెచ్‌వో వెంకన్న చౌదరి కథనం మేరకు....సాంబశివ ఇంజినీరింగ్‌ వర్క్‌షాపు యజమాని పామర్తి సాంబశివరావు గురువారం రాత్రి షాపుకు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం షాపునకు వచ్చి చూసేటప్పటికి షాపు తాళాలు పగులకొట్టి ఉన్నాయి. షాపులో పరిశీలించగా కౌంటర్‌ తాళాలు పగులకొట్టి  అందులోని రూ. 15 లక్షలు చోరీకి గురయినట్లు గుర్తించాడు. దీంతో సాంబశివరావు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడిషనల్‌ ఎస్పీ తిరుపాల్, డీఎస్పీ సంతోష్‌ కుమార్, ఎస్‌హెచ్‌వో వెంకన్న చౌదరి, క్లూస్‌ టీమ్‌ షాపును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  రాత్రి గస్తీలో ఉన్న సీసీఎస్‌ సీఐ తన విధులు సక్రమంగా నిర్వహింలేదన్న సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సీఐని అతని జీపు డ్రై వర్‌ను విచారిస్తున్నట్లు సమాచారం. సీఐ జిన్నాటవర్‌ సెంటర్‌లోని ఓ ఏటీఎమ్‌లో రాత్రి నిద్రించినట్లు సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆ కోణంలోనూ విచారిస్తున్నట్లు తెలిసింది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement