రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు | road accident three members | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Aug 22 2016 12:06 AM | Updated on Aug 30 2018 4:07 PM

మండల కేంద్రంలోని కోమటిపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్పల్ప గాయాలయ్యాయి.

మంగపేట : మండల కేంద్రంలోని కోమటిపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్పల్ప గాయాలయ్యాయి.  పొదుమూరుకు చెందిన కోలా ఉదయ్, కొప్పుల నవీన్, గగ్గూరి నగేష్‌లు మంగపేట సమీపంలోని ముక్కిడి పోచమ్మ ఆలయానికి వెళ్లి స్వగ్రామానికి బైక్‌పై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఏటూరునాగారం నుంచి భద్రాచలానికి వెళ్తున్న కారును గమనించకుండా.. రోడ్డు దాటేందుకు యత్నించారు. అయితే కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు.కాగా, ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో స్టాఫ్‌ నర్సులే వీరికి చికిత్స అందించారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న ఆస్పత్రి వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుడుందెబ్బ మండల అధ్యక్షుడు అల్లెం నర్సింహారావు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement