డీసీఎం, లారీ ఢీ: ఇద్దరు మృత్యువాత | road accident kills two in rangareddy district | Sakshi
Sakshi News home page

డీసీఎం, లారీ ఢీ: ఇద్దరు మృత్యువాత

Aug 4 2016 9:42 AM | Updated on Aug 30 2018 4:07 PM

రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం దొంగల మైసమ్మ స్టేజీ వద్ద గురువారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

షామీర్‌పేట(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం దొంగల మైసమ్మ స్టేజీ వద్ద గురువారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎల్బీనగర్ నుంచి కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు నాపరాళ్ల లోడుతో వెళ్తున్న లారీని దొంగలమైసమ్మ చౌరస్తాలో ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది.

ఈ ఘటనలో లారీలోని బండలపై కూర్చున్న కూలీలు మహబూబ్‌నగర్‌కు చెందిన తిరుపతయ్య(31), రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన కుమార్(28) అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108లో ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement