భక్తులారా.. ఈ జాగ్రత్తలు పాటించండి.. | restrictions for piligrims who attend for holy bath | Sakshi
Sakshi News home page

భక్తులారా.. ఈ జాగ్రత్తలు పాటించండి..

Jul 14 2015 12:47 PM | Updated on Aug 1 2018 5:04 PM

గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల వద్ద భక్తులు పాటించాల్సిన నియమావళిని రూపొందించారు.

రాజమండ్రి / ఏలూరు: గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల వద్ద భక్తులు పాటించాల్సిన నియమావళిని రూపొందించారు. పుష్కర యాత్రికులు అప్రమత్తంగా ఉంటూ.. స్నానఘట్టాల వద్ద ఈ సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • ప్రభుత్వం సూచించిన స్నానఘట్టాలలోనే స్నానం చేయాలి
  • పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ముందుగా స్నానం చేసే అవకాశం ఇవ్వాలి
  • క్యూ పద్ధతి పాటించాలి
  • వీలైనంత తక్కువ సమయంలో పుష్కర స్నానం చేసి మిగతా వారికి అవకాశం ఇవ్వండి
  • ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించండి
  • హారతి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం
  • పొగతాగడం నిషేధం
  • ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ప్రజా రవాణా వాహనాల్లోనే వెళ్లేందుకు ప్రయత్నించడం
  • ఏదైనా సమస్య అనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం. భక్తులు కంగారు పడి ఆందోళన కలిగిస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుందని గుర్తించి మసలుకోవాలి
  • స్నాన ఘట్టాల వద్ద భక్తులు వినియోగించే మెటీరియల్ వేసేందుకు ఆరెంజ్ రంగు డస్ట్బిన్ లు, పిండ ప్రదానం జరిగే ప్రదేశాల్లో వెదురు డస్ట్ బిన్లలో వ్యర్ధపదార్థాలను పడవేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement