సంగం : మండల కేంద్రమైన సంగం సమీపంలోని పెన్నానదిపై ఉన్న ఆనకట్టకు శుక్రవారం మరమ్మతు పనులు ప్రారంభించారు.
ఆనకట్టకు మరమ్మతులు
Aug 6 2016 12:56 AM | Updated on Sep 4 2017 7:59 AM
	సంగం : మండల కేంద్రమైన సంగం సమీపంలోని పెన్నానదిపై ఉన్న ఆనకట్టకు శుక్రవారం మరమ్మతు పనులు ప్రారంభించారు. గతంలో కురిసిన వర్షాల వల్ల ఆనకట్టపై పలుచోట్ల గోతులు ఏర్పడ్డాయి. ఈ ఆనకట్ట కింద 2.75 లక్షల ఎకరాలు సాగులో ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇరిగేషన్శాఖ గుంతలు పడిన స్థానంలో కాంక్రీట్ పనులను ప్రారంభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
