
ప్రతి ఏడాదీ తగ్గుముఖమే..
జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. పురుష, స్త్రీ, థర్డ్జెండర్... ఇలా మూడు వర్గాల ఓటర్లు తగ్గడం విశేషం.
తగ్గిన ఓటర్ల సంఖ్య
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. పురుష, స్త్రీ, థర్డ్జెండర్... ఇలా మూడు వర్గాల ఓటర్లు తగ్గడం విశేషం. ఉపాధి అవకాశాలు తగ్గడం, సరైన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడం ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారుు. దీంతో మళ్లీ ఓటర్ల సంఖ్య పెంచేందుకు అధికారులు గట్టిగా ప్రయత్నించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2015 ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం తర్వాత ఓటర్ల సంఖ్య 17 లక్షల 31 వేలకు పైగా ఉండేది. 2016 ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరిగే సరికి ఇది కాస్తా 16,61,593కు చేరింది. ఈ ఏడాది జనవరిలో ఈ జాబితా ప్రచురించారు. అరుుతే తాజాగా 2017 ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రక్రియ నవంబర్ 15వ తేదీ నుంచి చేపట్టారు. ఇందుకు సంబంధించిన జాబితాలు మంగళవారం జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రచురించారు.
వలసవెళ్లిన వారే ఎక్కువ
ఓటర్ల సంఖ్య గణీనీయంగా తగ్గడానికి ఓటర్లు మృతి చెందడం ఒక కారణం..వలసలు మరో కారణమని తెలుస్తోంది. జిల్లా నుంచి వివిధ మండలాల నుంచి చెన్నై నగరానికి వలస వెళ్లిన వారి సంఖ్య గణీనీయంగా ఉంది. వీరితోపాటు విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరితో పాటు ఇతర ప్రాంతాలకు ఓటర్లు చాలావరకు శాశ్వతంగా వలస వెళ్లిపోయారు. వీరు ఎన్నికలపుడు మినహా మిగతా సమయంలో జిల్లాకు రారు. పండగ, ఇతర శుభ కార్యక్రమాలు, ఏదో సందర్భంలో మాత్రమే వచ్చి వెళతారు. అరుుతే అధికారులు చేస్తున్న సర్వేలకు వీరు అందుబాటులో ఉండకపోవడంతో ఓటర్ల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు.
మరింత తగ్గుముఖం
తాజాగా ప్రచురించిన జాబితా ప్రకారం చూస్తే జిల్లాలో ఓటర్ల సంఖ్య మరింత తగ్గింది. జనవరిలో ప్రచురించిన జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,61,593 ఉండగా తాజా జాబితా ప్రకారం 16,22,869 మంది ఉన్నారు. ఈలెక్కన చూస్తే 38,724మంది ఓటర్లు తగ్గారు. పురుషులు అప్పుడు 8,19,988 ఉండగా స్త్రీలు 8,41,605, థర్డ్జెండర్ 138 మంది ఉన్నారు. తాజా జాబితాలో పురుషులు 8,01,526 మంది, స్త్రీలు 8,21,224మంది, థర్డ్జెండర్ 129 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్క చూస్తే మూడు వర్గాల ఓటర్లూ తగ్గారు.