క్వారీ లారీ ఢీకొని వ్యక్తి మృతి | raod accident.. oldman dead | Sakshi
Sakshi News home page

క్వారీ లారీ ఢీకొని వ్యక్తి మృతి

Jan 7 2017 1:28 AM | Updated on Apr 3 2019 7:53 PM

క్వారీ లారీ ఢీకొని వ్యక్తి మృతి - Sakshi

క్వారీ లారీ ఢీకొని వ్యక్తి మృతి

తాడేపల్లిగూడెం – భీమవరం రోడ్డుపై పెంటపాడు మిడ్‌ లెవెల్‌ కాలువ వంతెన వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

పెంటపాడు : తాడేపల్లిగూడెం – భీమవరం రోడ్డుపై పెంటపాడు మిడ్‌ లెవెల్‌ కాలువ వంతెన వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెంటపాడు ఎస్సై వాసంశెట్టి సుబ్రహ్మణ్యం కథనం ప్రకారం.. పెంటపాడుకు చెందిన  కర్రి వెంకటరెడ్డి(65)  మోటార్‌సైకిల్‌పై తాడేపల్లిగూడెం వెళ్లి తిరిగి వస్తున్నాడు. ముదునూరుపాడు చర్చి వద్ద ముందు వెళ్తున్న సైకిల్‌ను తప్పించే క్రమంలో మోటార్‌సైకిల్‌ అదుపుతప్పింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన క్వారీ లారీ కింద వెంకటరెడ్డి పడ్డాడు. లారీ వెనుక చక్రం అతనిపైనుంచి వెళ్లిపోవడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. పోలీసులు మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. ఎస్సై సుబ్రహ్మణ్యం కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    గ్రామ ఉపసర్పంచ్‌ నల్లమిల్లి చినగోపిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నేత నల్లమిల్లి విజయానందరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబానికి సంతాపం తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement