Apr 21 2017 11:02 PM | Updated on Sep 5 2017 9:20 AM
కొండ చిలువ కలకలం
పార్లపల్లి గ్రామంలో శుక్రవారం ఓ కొండ చిలువ కలకలం సృష్టించింది.
ఎమ్మిగనూరు రూరల్ : పార్లపల్లి గ్రామంలో శుక్రవారం ఓ కొండ చిలువ కలకలం సృష్టించింది. గ్రామ సమీపంలోని పశువుల పాకలో కొండవ చిలువను చూసిన గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివెళ్లారు. జనం చప్పుడు విని తప్పించుకోవటానికి ప్రయత్నించింది. పిల్లలను, మేకలను తినేస్తుందని భయపడి గ్రామస్తులు రాళ్లు, కర్రలతో కొట్టడంతో మృతి చెందింది.