ఐదు రోజులుగా మృతశిశువును కడుపులో ఉంచుకుని అవస్థలు
కుటుంబీకుల ఆందోళనతో దిగివచ్చిన ఆస్పత్రి సిబ్బంది
కంబాలచెరువు (రాజమహేంద్రవరంసిటీ) : వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి తీవ్ర అవస్థలకు గురైంది. తన కడుపులోని శిశువు చనిపోయాడని ఒకసారి.. తర్వాత బయటకు వస్తుందని మరోసారి చెప్పి ఐదు రోజులు నిర్లక్ష్యంగా వదిలేశారు. బాధితురాలి ప్రాణం మీదకు వచ్చేసరికి› కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా కుటుంబీకులతో సహా పలువురు ఆందోళన చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం చికిత్స ప్రారంభించారు. రాజమహేంద్రవరంలోని క్వారీ ప్రాంతానికి చెందిన కొల్లి వెంకటేశ్వరి రెండోకాన్పు చేసుకునేందుకు తన భర్త సతీష్తో కలిసి ఈ నెల ఐదో తేదీ సాయంత్రం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అక్కడ డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ విష్ణువర్ధిని ఆమెను మర్నాడు రమ్మని చెప్పి పంపించివేసింది. శనివారం ఉదయం వచ్చిన వెంకటేశ్వరికి వైద్యపరీక్షలు చేసిన డాక్టర్ విష్ణువర్ధిని కడుపులో బిడ్డ చనిపోయిందని సాయంత్రం రమ్మని మళ్లీ పంపేశారు.
మళ్లీ సాయంత్రం వచ్చిన వెంకటేశ్వరిని ఆస్పత్రిలో చేర్చుకుని నార్మల్ డెలివరీ అవుతుంది కంగారుపడకు అని చెప్పి వదిలేశారు. తర్వాత ఆది, సోమ, మంగళ వారాలు గడిచి బుధవారం వచ్చిందేకాని కడుపులో మృతశిశువు బయటకు రాలేదు. డాక్టర్ విష్ణువర్ధిని సెలవుపై వెళ్లడంతో విధుల్లో ఉన్న వైద్యాధికారి డాక్టర్ వసుంధర వద్దకు వారు వెళ్లి విష్ణువర్ధిని రాసిచ్చిన మందులను ఆమెకు చూపారు. వాటిని ఆమె విసిరేసి వీటితో డెలివరీ అవ్వదు.. కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లిపొమ్మని, లేకపోతే తల్లికి ప్రమాదమని చెప్పారు. దీంతో విషయాన్ని కుటింబీకులకు తెలపడంతో స్థానిక నాయకులు దాస్య ప్రసాద్, కందికొండ రమేష్,› వానపల్లి శంకర్, అజ్జరపు వాసు తదితరులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. దీంతో ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మశ్రీ వచ్చి జరిగిన విషయం తెలుసుకుని కుటుంబీకులతో మాట్లాడి చికిత్స రాజమహేంద్రవరంలోనే అందిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
కన్నుమూసిన కలను కడుపున మోస్తూ
Published Thu, May 11 2017 4:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement