ఫోర్జరీ సంతకాలపై పోలీసుల విచారణ | Police inquiry on forgery | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ సంతకాలపై పోలీసుల విచారణ

Sep 15 2016 11:45 PM | Updated on Oct 3 2018 6:52 PM

ఫోర్జరీ సంతకాలపై పోలీసుల విచారణ - Sakshi

ఫోర్జరీ సంతకాలపై పోలీసుల విచారణ

కలిగిరి : తహసీల్దార్, వీఆర్వోల స్టాంపులు, సంతకాలు ఫోర్జరీ చేసిన కేసుపై ఎస్సై ఎస్‌కే ఖాధర్‌బాష ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఆయన తహసీల్దార్‌ రవీంద్రనాథ్‌ను కలిసి వివరాలు నమోదు చేసుకున్నారు.

కలిగిరి : తహసీల్దార్, వీఆర్వోల స్టాంపులు, సంతకాలు ఫోర్జరీ చేసిన కేసుపై ఎస్సై ఎస్‌కే ఖాధర్‌బాష ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఆయన తహసీల్దార్‌ రవీంద్రనాథ్‌ను కలిసి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన మార్తులవారిపాలెంకు చెందిన మూలి పెంచలయ్య వీఆర్వో స్టాంపు, సంతకాలు ఫోర్జరీ చేసి కలిగిరిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో రుణాలు పొందడానికి ప్రయత్నించాడరన్నారు. ఏపీజీబీ బ్రాంచ్‌ మేనేజర్‌ మేనేజర్‌ ప్రదీప్‌ ఈ విషయాన్ని గుర్తించారన్నారు. ఎస్సై మాట్లాడుతూ ఫోర్జరీ సంతకాలతో రుణాల పొందడానికి ప్రయత్నించిన వ్యక్తితో పాటు అధికారుల స్టాంపులు తయారుచేసిన వారిపై, సంతాకాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ సూత్రదారులను వెలుగులోకి తీసుకువస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement